వరంగల్ కరీమాబాద్, ఏప్రిల్ 30 (ఆంధ్రప్రభ) : వరంగల్ తూర్పు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ లు కేటాయించాలని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ ధర్నా చేపట్టారు. బుధవారం ఏకశిలా పార్క్ లో అర్హులైన జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ లు కేటాయించాలని వారు గత 16 రోజుల నుండి నిరాహార దీక్ష చేపట్టినా జిల్లా యంత్రాంగం, ఎమ్మెల్యేలు స్పందించడం లేదని గంటా రవికుమార్ అన్నారు. తక్షణమే తూర్పు జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ కేటాయించాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
WGL | జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ లు కేటాయించాలని బీజేపీ ధర్నా
