Bhupalpalli | పెద్దపులి సంచారం..
- చిట్యాల మండలంలో ప్రజలు ఆందోళన
Bhupalpalli | చిట్యాల, ఆంధ్రప్రభ : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని జడలపేట శివారు ప్రాంతంలో పెద్దపులి సంచారం కలకలం రేపింది. ఆదివారం ఉదయమే ఒక ఎద్దు పై దాడి చేసి చంపేసినట్లు పులి అడుగుల ద్వారా గ్రామస్తులు గుర్తించారు.. దీంతో శివారు గ్రామాలైన జడల్పేట్ , గాంధీనగర్, భీష్మ నగర్, రామచంద్రపూర్ ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

