Bhadrachalam | సీతారాముల కల్యాణానికి పవన్ కల్యాణ్ ….

  • రేపు భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు
  • ఏపీ ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పించనున్న పవన్
  • రేపు భద్రాచలం వెళుతున్న రేవంత్ రెడ్డి

భద్రాచలం – ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు భద్రాచలంకు వెళుతున్నారు. రేపు భద్రాద్రిలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరగనున్నాయి. పండుగరోజుకు ఒక్క రోజు ముందుగానే పవన్ భద్రాచలంకు వెళుతున్నారు. ఏపీ ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలను సీతారాముల కళ్యాణానికి పవన్ సమర్పించనున్నారు. ఈ మధ్యాహ్నం హైదరాబాద్ మాదాపూర్ లో ఉన్న తన నివాసం నుంచి రోడ్డు మార్గంలో ఆయన భద్రాచలంకు బయలుదేరుతారు. సాయంత్రం 5 గంటలకు ఆయన భద్రాచలం చేరుకుంటారు. ఈ రాత్రికి భద్రాచలంలోనే ఆయన బస చేస్తారు.

రేపు సీతారాముల కళ్యాణానికి పవన్ హాజరవుతారు. ఈ సందర్భంగా స్వామివారికి ముత్యాల తలంబ్రాలను సమర్పిస్తారు. రేపు సాయంత్రం 5 గంటలకు భద్రాచలం నుంచి తిరుగుపయనమవుతారు. రేపు రాత్రి 10 గంటలకు హైదరాబాద్ లోని నివాసానికి చేరుకుంటారు. మరోవైపు, రేపు స్వామివారి కళ్యాణానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు భద్రాచలం వెళ్లనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *