టీమిండియాకు తమ కెప్టెన్సీలో విశేష సేవలు అందిచిన లెజెండరీ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ.. ఇటీవల టీ20, టెస్ట్ రెండు ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ గెలిచిన తర్వాత టీ20 అంతర్జాతీయ మ్యాచ్లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లీలు.. తాజాగా టెస్ట్ ఫార్మాట్కు కూడా గుడ్ బై చెప్పేశారు.
మూడు ఫార్మాట్లలో రెండింటి నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వారిద్దరూ… వన్డేల్లో మాత్రమే ఆడనున్నారు. దాంతో వారిద్దరికీ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీ మారుతుందా లేదా అనే దానిపై చర్చ జరుగుతోంది.
అయితే, రోహిత్ – కోహ్లీలకు బీసీసీఐ బంపరాఫర్ ఇచ్చింది. బీసీసీఐ కార్యదర్శి దేవ్జిత్ సైకియా విరాట్ కోహ్లీ – రోహిత్ సెంట్రల్ కాంట్రాక్ట్ కేటగిరీపై అప్డేట్ ఇచ్చారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ బిసిసిఐ సెంట్రల్ కాంట్రాక్ట్లోని ఎ+ కేటగిరీలోనే ఉంటారని ఆయన అన్నారు. తదుపరి కాంట్రాక్ట్ సమయంలో వారి కేటగిరి మారే అవకాశం ఉంది.
ఈసారి సెంట్రల్ కాంట్రాక్ట్ చోటు దక్కించుకున్న ఆటగాళ్లు వీరే !
- ఎ+ కేటగిరీ లో – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా ఉన్నారు.
- ఎ కేటగిరీలో- కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, మహ్మద్ సిరాజ్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ ఉన్నారు.
- బి కేటగిరీ లో- కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, శ్రేయాస్ అయ్యర్ ఉన్నారు.
- సి కేటగిరీ లో – రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రింకు సింగ్, తిలక్ వర్మ, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముకేష్ కుమార్, నితీష్ కుమార్ రెడ్డి, సంజూ శాంసన్, ప్రసిద్ధ కృష్ణ, రజత్ పాటిదార్, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, అర్షదీప్ సింగ్, ఇషాన్ కిషన్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు.
అయితే, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోసం, ఒక ఆటగాడు సంవత్సరంలో కనీసం 3 టెస్టులు, 8 వన్డేలు లేదా 10టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాలి. ఒక ఆటగాడు టెస్ట్లు ఆడకపోయినా, ODIలు , T20లు ఆడితే, సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలో చోటు దక్కుంతుంది.