విజయవాడ – గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి (vallabhaneni vamsi ) జైలు నుంచి నేటి మధ్యాహ్నం విడుదలయ్యారు(released ) .. వివిద కేసులలో ఆరెస్ట్ అయిన అయనకు బెయిల్ (bail ) లభించడంతో విడుదలకు మార్గం సుగమం అయింది. ఆయనపై నమోదైన నకిలీ ఇళ్ల పట్టాల కేసుకు సంబంధించి, బెయిల్ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను నేడు విచారించిన సుప్రీంకోర్టు (supreme court ) దానిని తోసిపుచ్చింది. ఈ సందర్భంగా సివిల్ స్వభావం ఉన్న వివాదాన్ని క్రిమినల్ కేసుగా ఎలా పరిగణిస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. అయనకు కింద కోర్టు ఇచ్చిన బెయిల్ రద్దు చేసేందుకు నిరాకరించింది సుప్రీం కోర్టు.. ఈ నేపథ్యంలో బెయిల్ పేర్కొన్న షరతులతో వంశీ న్యాయవాదులు జైలు సూపరింటెండెంట్ కు డాక్యుమెంట్లు. దరావత్తు సోమ్ము ఇవ్వడంతో వంశీని విడుదల చేశారు..
కాగా, , 2019 ఎన్నికల సమయంలో గన్నవరం నియోజకవర్గంలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు వంశీ నకిలీ ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారన్నది ప్రధాన ఆరోపణ. ఈ కేసులో నూజివీడు రెండో అదనపు జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు వంశీకి బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఈ బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ సీతామహాలక్ష్మి సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం, వంశీకి కిందికోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్ను రద్దు చేయడానికి నిరాకరించింది. ఇదే సమయంలో, వంశీపై ఉన్న అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తు నివేదికను సీల్డ్ కవర్లో తమకు సమర్పించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసుపై తదుపరి విచారణను ఈ నెల 16వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.
