చిత్తూరులోని గాంధీరోడ్డులో కాల్పులు కలకలం సృష్టించాయి. లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లోకి దొంగల ముఠా చొరబడింది. రెండు తుపాకులతో వారు గాల్లోకి కాల్పులు జరిపారు.
ఇంటి యజమాని అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికి చేరుకుని నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. రెండు తుపాకులు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.