- జూన్ 20 నుండి జూన్ 23 వరకు గ్రీవెన్స్కు బ్రేక్
అమరావతి, ఆంధ్రప్రభ: తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా వేదిక (గ్రీవెన్స్) నాలుగు రోజుల పాటు రద్దు అయింది. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని 21న విశాఖలో యోగాంధ్ర జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం నుంచి నాలుగు రోజుల పాటు మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో జరగాల్సిన ప్రజా వేదిక కార్యక్రమం రద్దు చేస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
ఈ నెల 20 నుంచి 23 వరకు అంటే శుక్రవారం నుంచి సోమవారం వరకు ఎటువంటి గ్రీవెన్స్ ఉండదని టీడీపీ కేంద్ర కార్యాలయ కార్యదర్శి అశోక్ బాబు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజలు గమనించాలని అశోక్ బాబు కోరారు.