AP liquor case | ధనుంజయ రెడ్డి, కృష్ణమోన్ రెడ్డిలకు రిమాండ్ !

విజయవాడ: రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ధనుంజయ రెడ్డి, కృష్ణమోన్ రెడ్డిలకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. మధ్యం కేసులో నిన్న అరెస్టయిన ధనుంజయ రెడ్డి, కృష్ణమోన్ రెడ్డిలను ఈ రోజు వైద్య పరీక్షల అనంతరం విజయవాడ జిల్లా కోర్టు ఎదుట హాజరుపరిచారు.

కాగా, కోర్టులో వాదనలు ముగిసిన తర్వాత, న్యాయస్థానం ఈ నెల 20వ తేదీ వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో ధనుంజయ రెడ్డి, కృష్ణమోన్ రెడ్డిలను పోలీసులు విజయవాడ జిల్లా జైలుకు తరలించారు. జైల్లో ధనుంజయ రెడ్డి, కృష్ణమోన్ రెడ్డిలను ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని అధికారులకు కోర్టు సూచించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *