తిరుపతి, ఆంధ్రప్రభ బ్యూరో (రాయలసీమ) – వైఎస్సార్ కడప జిల్లా: వైఎస్సార్ కడప జిల్లా జడ్పీ ఛైర్మన్ పదవి వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. వైఎస్సార్ జిల్లా పరిషత్ చైర్మన్గా వైఎస్సార్సీపీ జడ్పీటీసీ రామగోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. . ఒకే ఒక్క నామినేషన్ రావడంతో ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి ప్రకటించారు. అనంతరం రామగోవిందరెడ్డి జడ్పీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేశారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధ్యక్షత న ఉదయం జరిగిన సమావేశం లో ఈ ఎన్నిక నిర్వహించారు.. బి.మఠం జడ్.పి.టి.సి ముత్యాల రాంగోవిందరెడ్డి మినహా మిగిలిన వారు ఏవరూ నామినేషన్ చేయకపోవడం తో ఎకగ్రీవం అయినట్లు ప్రకటించిన జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ప్రకటించారు.
గత స్థానిక ఎన్నికల్లో గెలిచి జిల్లా పరిషద్ చైర్మన్ గా ఎన్నికైన అమరనాధ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గా రాజంపేట నియోజకవర్గం నుంచీ పోటీ చేసి గెలుపొందడం తో ఇప్పుడు ఎన్నిక అనివార్యం అయింది. కూటమి ప్రభుత్వం రాష్ట్రాధికారం చేపట్టగానే కేవలం ఒక్క జడ్ పి టి సి మాత్రమే ఉన్న తెలుగుదేశం ఎలాగైనా జడ్ పి చైర్మన్ పదవిని దక్కించుకోవాలని భావించింది. ఈ నేపథ్యంలో
గత అరేడునెలాలుగా వ్యూహ ప్రతివ్యూహల నడుమ చైర్మన్ పదవిని కైవసం చేసుకోడానికి తెలుగుదేశం పార్టీ, నిలబెట్టుకోడానికి వైసీపీ ఎత్తులు పై ఎత్తులతో పావులు కదిపాయి. రెండు రోజుల క్రితం బలం లేని చోట చేసే ప్రయత్నం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తుందని కూటమి ప్రభుత్వ నేతలు భావించడం తో తెలుగుదేశం పోటీ చేయరాదనీ నిర్ణయించుకుంది. ఫలితంగా ఈరోజు జరిగిన ఎన్నికలో కడప జిల్లా పరిషద్ చైర్మన్ పదవిని వైసీపీ తిరిగి దక్కించుకున్నట్టయింది.

పలు ఎంపిపి స్థానాలలో వైసిపి అభ్యర్దుల విజయం

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఆళ్ల సుబ్బమ్మ విజయం సాధించారు. అనంతపురం జిల్లా పరిషత్ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ సత్తా చాటింది. రొద్దం ఎంపీపీ స్థానాన్ని వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి నాగమ్మ ఘన విజయం సాధించారు. రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ ఎంపీపీ వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. తిరుపతి రూరల్ ఎంపీపీ స్థానం వైఎస్సార్సీపీ సొంతం చేసుకుంది. వైఎస్సార్సీపీ అభ్యర్థి మూలం చంద్రమౌళిరెడ్డి గెలుపొందారు. ఆయనకు 33 మంది వైఎస్సార్సీపీ సభ్యులు మద్దతునిచ్చారు.
విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గ మాకవరపాలెం ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి రుత్తుల సర్వేశ్వరరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బలం లేకపోవడంతో టీడీపీ ఎంపీటీసీలు పోటీకి దూరంగా ఉన్నారు
మాడుగుల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి తాళ్లపురెడ్డి రాజారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎస్. రాయవరం మండల ఎంపీపీగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కేసుబోయిన వెంకటలక్ష్మి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దేవరపల్లి మండలం ఎంపీపీగా చింతల భూలోక లక్ష్మీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.