చిత్తూరు బ్యూరో, ఆంధ్రప్రభ : చిత్తూరు నడివీధి గంగమ్మ జాతర మంగళవారం నుండి రెండు రోజుల పాటు అత్యంత వైభవముగా జరగనుంది. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త, చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సికే బాబు ఆధ్వర్యంలో ఈ గంగ జాతర జరుగుతుంది. జాతర సందర్భంగా పట్టణం జనసముద్రం కానుంది. ఇది రాయలసీమలోనే అతి పెద్ద గంగజాతర. ఈ జాతరను చూడటానికి ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు భారీగా తరలి వస్తారు. రెండవ రోజు జరిగే ఓం శక్తి భక్తుల విన్యాసాలు ఒళ్ళు గగుర్పాటుకు గురిచేస్తాయి. ఈ విన్యాసాలను చూడానికి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు.
రెండు రోజుల పాటు చిత్తూరు గంగమ్మ జాతర..
