AP | వైసీపీ నేత సజ్జల పై కేసు నమోదు..

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డిపై క్రిమినల్ కేసు నమోదైంది. అమరావతి ప్రాంత మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు ఫైల్ అయింది.

ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కంభంపాటి శిరీష ఫిర్యాదు చేయగా, ఆమె ఫిర్యాదును ఆదారంగా తీసుకుని పోలీసులు కేసు నమోదు చేశారు.

సజ్జల చేసిన వ్యాఖ్యలు మహిళల ఆత్మగౌరవాన్ని భంగపెట్టేలా ఉన్నాయని శిరీష తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం సంబంధిత ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగుతోందని అధికారులు తెలిపారు

Leave a Reply