అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షత జరిగిన ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా రాజధాని అమరావతిగా తీర్మానం చేసింది కేబినెట్. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణ పనులు ప్రారంభించిన ప్రధాని మోదీకి క్యాబినెట్ ధన్యవాదాలు తెలిపింది. 47వ సీఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేసింది. రాజధాని పరిధిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులపై ఆమోదం తెలిపింది. తీరప్రాంత భద్రత, రక్షణ రంగ పరిశ్రమల వద్ద జాగ్రత్తలు వంటి అంశాలపై చర్చించింది.
2014 ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణ చేయాలని కేంద్రాన్ని కేబినెట్ కోరింది. పునర్విభజన చట్టంలో రాజధానిగా అమరావతి అని పెట్టాలని మంత్రి మండలి కోరింది. దీని వలన అమరావతికి చట్టబద్ధత కల్పించినట్టు అవుతుందని కేబినెట్ పేర్కొంది. ఏపీ పునర్విభజన చట్టంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనను ఆమోదం తెలిపింది. ఏపీ రాజధాని స్థానంలో అమరావతి పేరు చేర్చే ప్రతిపాదనకు ఓకే చెప్పింది.
ముఖ్యంగా ఆపరేషన్ సిందూర్కు ఏపీ కేబినెట్ అభినందలు తెలియజేసింది. ప్రధాని, భారత సైన్యానికి అండగా ఉండాలని నిర్ణయించింది. అలాగే ఏపీ రాజధాని అమరావతిగా కేబినెట్ తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపాలని నిర్ణయించింది. క్యాపిటల్ అమరావతిని ఫ్రీ జోన్గా చేసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు.