కౌన్​ ..బనేగా.. ప్రజాపతి

కౌన్​ ..బనేగా.. ప్రజాపతి

కౌన్​ ..బనేగా.. ప్రజాపతి

(ఆంధ్రప్రభ, వెబ్​ డెస్క్​ )

హోరాహోరీగా బీహార్​ అసెంబ్లీ ఎన్నికలు ,, సహా దేశ వ్యాప్తంగా ఆరు రాష్ర్టాల్లో 8 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్​ జరిగింది. శుక్రవారం ఎన్నికల ఫలితాలు వెలువనున్నాయి. బీహార్​ అసెంబ్లీ ఎన్నికలే కాదు… జమ్మూకాశ్మీర్​, తెలంగాణ, ఒడిషా, జార్ఖండ్​, మిజోరాం, పంజాబ్​ రాష్ట్రాల్లోని ఉప ఎన్నికల ఫలితాలపైనే జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా.. కౌన్​ బనేగా బీహారీ సీఎం అనే అంశంపైనే నరాలు తెగే ఉత్కంఠత నెలకొంది. ఈ సారి ప్రధాన సీఎం అభ్యర్థిగా జేడూయూ నేత నితీశ్​ కుమార్​  లేరు. ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తే.. సీఎం అభ్యర్థి ఎవరు? అనే అంశంపైనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే మహాఘట్బంధన్​ సీఎం అభ్యర్థిగా తేజస్వీ యాదవ్​ రంగంలో ఉన్నారు. తమ ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని, సీఎం తానే నని తేజస్వీ యాదవ్​ ఇప్పటికే ఆత్మవిశ్వాసాన్ని ప్రకటించారు. తన వ్యూహరచనతో  దేశవ్యాప్తంగా  ఎన్నో రాజకీయ పార్టీల దోసెట్లో అధికారాన్ని అందించిన ఎలక్షన్​ ఈవెంట్​ మేనేజర్​ ప్రశాంత్​ కిశోర్​ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణంలో.. ఆయన స్థితి గతిపై చర్చ జరుగుతోంది. ఆయన ప్లానింగ్​ లో అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలూ.. ఆయనను దూరం చేసుకున్న స్థితిలో.. తన సొంత ఇలాఖాలో తన సత్తా నిరూపించి.. మళ్లీ దేశంలో తనను మించిన ఈవెంట్​ మేనేజర్​ లేరని నిరూపించుకునే ప్రయత్నం చేసిన ప్రశాంత్​ కిషోర్​ .. భవితవ్యం ఏమిటో కొన్ని గంటల్లో తేలిపోతుంది. ఇక తెలంగాణలో బీఆర్​ఎస్​ తన సీటును నిలబెట్టుకుందా? కాంగ్రెస్​ కొల్లగొట్టిందా? మధ్య బీజేపీ ఉనికి పుంజుకుందా? మరి క్షణాల్లో తేలుతుంది. క్షణ క్షణం .. ఎప్పటి కప్పుడు ప్రభన్యూస్​ .కామ్​ లో  ఎన్నికల ఫలితాల సమాచారం  తెలుసుకోండి.. మరిన్ని విశ్లేషణాత్మక స్టోరీలు చదవండి ..

Leave a Reply