All Party Meeting | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు – మ‌రి కాసేప‌ట్లో అఖిల‌ప‌క్షం భేటి

న్యూఢిల్లీ – పార్లమెంటు వర్షాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత తొలిసారి జరుగుతున్న ఈ సమావేశాలు వాడీవేడిగా కొనసాగే అవకాశాలున్నాయి. ఈ సమావేశాలలో 12 బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవాలని కేంద్రం భావిస్తోంది. వీటిలో కొన్ని ఇప్పటికే పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నవి కాగా, 8 బిల్లులు కొత్తగా ప్రవేశపెట్టనున్నట్లు లోక్‌సభ వర్గాలు తెలిపాయి

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనుంది. పార్లమెంటు భవన సముదాయంలోని ప్రధాన హాల్‌లో పార్లమెంటరీ వ్యవహారాలు, మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్‌ రిజిజు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో కేంద్ర మంత్రులతో పాటు, ప్రతిపక్షాలకు చెందిన పార్లమెంటరీ పార్టీ నేతలు హాజరవుతారు. ఉభయసభలు సజావుగా కొనసాగేందుకు సూచనలు తీసుకోవడం, ఉభయసభలలో చర్చించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయించనున్నారు.

One thought on “All Party Meeting | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు – మ‌రి కాసేప‌ట్లో అఖిల‌ప‌క్షం భేటి

Leave a Reply