TG | విద్యుత్ శాఖ ఏడీఈ సతీష్ రెడ్డి ఆస్తులు రూ.100 కోట్లకు పైనే !
హైదరాబాద్ : విద్యుత్ శాఖ ఏడీఈ సతీష్ రెడ్డి నిన్న రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీకి పట్టుబడ్డాడు. దీంతో ఆయన నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన ప్రాంతాల్లో నిన్నటి నుంచి ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు భారీ ఆస్తులను గుర్తించారు. సతీష్ రెడ్డి ఆస్తుల విలువ దాదాపు రూ.100 కోట్లకుపైగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
హైదరాబాద్తో పాటు రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో ఆయనకు స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. 22 ఎకరాల వ్యవసాయ భూమి, ఖాళీ స్థలాలు, విల్లా, భవనాలు గుర్తించారు. ఈ స్థిరాస్తి మార్కెట్ విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. సతీష్ రెడ్డి నివాసంలో బంగారం, నగదు, స్థిరాస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.