Accident| టెంపో – లారీ ఢీ : ముగ్గురు దుర్మరణం

మదనపల్లి : అన్నమయ్య జిల్లాలో (annamayya district) రోడ్డు ప్రమాద ( road accident) ఘటన చోటుచేసుకుంది. ప్రయాణీకులతో వెళ్తున్న ఓ టెంపో (tempo) వాహనాన్ని లారీ ( lorry ) ఢీకొట్టింది to( collision) . ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా..మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

వివరాలలోకి వెళితే. ..

కురబలకోట మండలం దొమ్మన బావి వద్ద జాతీయ రహదారిపై సోమవారం ఉదయం టెంపో వాహనాన్ని లారీ ఢీకొట్టింది. తిరుమల నుంచి కర్ణాటక బాగేపల్లి వెళ్తున్న టెంపో ట్రావెల్ ను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, 9 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. మృతి చెందిన వారు చరణ్, మేఘర్ష్, శ్రావణి గా గుర్తించారు. డ్రైవర్ మంజునాథ్ తో సహా మరో 8 మందికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడ్డవారిని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదఘటన పై ముదివేడు పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

Leave a Reply