Naxal | 12మంది మావోయిస్టుల లొంగుబాటు
Naxal | రాజ్ నంద్ గావ్: ఛత్తీస్గఢ్లో నక్సల్ (Nexak) వ్యతిరేక పోరాటంలో మరో కీలక మైలురాయి నమోదైంది. ఖైరాగఢ్ ప్రాంతంలో ప్రముఖ మావోయిస్టు కమాండర్ సహా 12మంది మావోయిస్టులు ఆయుధాలతో కలిసి లొంగిపోవడంతో ఎంఎంసీ జోన్ దాదాపు నక్సల్ రహిత ప్రాంతంగా మారినట్లైంది.
ఛత్తీస్ గఢ్ లోని రాజ్ నంద్ గావ్ జిల్లాలో గల ఖైరాగఢ్ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఎంఎంసీ(మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్ గఢ్) జోన్ లో చురుకుగా పనిచేసిన మావోయిస్టు కమాండర్ రామ్ హర్ మజ్జి తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపోయాడు.
ఈ లొంగుబాటుతో ఎంఎంసీ (MMC) జోన్ ఇప్పుడు దాదాపు నక్సలైట్ రహితంగా మారిందని భద్రతా సంస్థలు పేర్కొన్నాయి. పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టులలో కమాండర్ రామ్ ధేర్ మజ్జీ, చందు ఉసెండి, లలిత, జానకి, ప్రేమ్, రాంసింగ్ దాదా, సుకేష్ పొట్టం, లక్ష్మి, షీలా, సాగర్, కవిత, యోగిత తదితరులు ఉన్నారు.
తాజాగా పోలీసులకు (Police) లొంగిపోయిన వారిలో రామ్ర్ మజ్జితో పాటు ఇతర ముఖ్య నాయకులు కూడా ఉన్నారు. వారిలో నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు (డివిసిఎంలు) చందు ఉసేండి, లలిత, జానకి, ప్రేమ్ ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై రూ.8 లక్షల బహుమతి ఉంది. అలాగే ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు.. రాంసింగ్ దాదా, సుకేష్ పొట్టం ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై రూ.5 లక్షల బహుమతి ఉంది. మిగిలిన ఐదుగురు కార్యకర్తలు.. లక్ష్మి, షీలా, సాగర్, కవిత యోగితా.. వీరిలో ఒక్కొక్కరిపై రూ.2 లక్షల బహుమతి ఉంది. వీరు పోలీసులకు అందించిన మొత్తం 10 ఆయుధాలలో ముఖ్యంగా AK-47లు, INSAS రైఫిల్స్, SLRలు, 303, 30 క్యాలిబర్ కార్బైన్లు తరహా అధునాతన ఆయుధాలు ఉన్నాయి.

