MOU | ఆర్‌టీఐహెచ్‌-పీబీ సిద్దార్థ క‌ళాశాల మ‌ధ్య ఎంవోయూ..


ఆవిష్క‌ర‌ణ‌ల ఆధారిత విద్యాభాగ‌స్వామ్యానికి చొర‌వ‌

MOU | పటమట, ఆంధ్రప్రభ : ఆవిష్క‌ర‌ణ‌ల ఆధారిత విద్యా భాగ‌స్వామ్యాన్ని పెంపొందించే ల‌క్ష్యంతో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్‌)-విజ‌య‌వాడ, పీబీ సిద్దార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ క‌ళాశాల (PB Siddhartha Arts and Science College) మ‌ధ్య మంగ‌ళ‌వారం ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ఒప్పందం (ఎంవోయూ) కుదిరింది. ఈ సంద‌ర్భంగా ఆర్‌టీఐహెచ్‌-విజ‌య‌వాడ సీఈవో జి.కృష్ణ‌న్ క‌ళాశాల‌లో జ‌రిగిన ఇంట‌రాక్టివ్ సెష‌న్‌లో విద్యార్థుల‌ను ఉద్దేశించి మాట్లాడారు. యువ‌త‌ను పారిశ్రామిక‌వేత్త‌లుగా తీర్చిదిద్దేందుకు అవ‌స‌ర‌మైన స‌హాయ‌స‌హ‌కారాలు ఆర్‌టీఐహెచ్ ద్వారా అందుతాయ‌న్నారు.

కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు దిశ‌గా విద్యార్థుల‌ను ప్రోత్స‌హించ‌డం, స‌రైన మార్గ‌నిర్దేశ‌నం అందించ‌డం, శిక్ష‌ణ కార్య‌క‌లాపాలు త‌దిత‌రాలకు ఈ ఎంవోయూ దోహ‌దం చేస్తుంద‌న్నారు. గౌర‌వ ముఖ్య‌మంత్రి దార్శ‌నిక‌త అయిన ఒక కుటుంబం-ఒక పారిశ్రామిక‌వేత్త దార్శ‌నిక‌త‌ను యువ‌త స‌రైన విధంగా అర్థంచేసుకొని.. ఆంత్ర‌ప్రెన్యూర్‌షిప్ దిశ‌గా అడుగేయాల‌న్నారు. ఆర్‌టీఐహెచ్ (RTIH) అందిస్తున్న మ‌ద్ద‌త‌ను, కార్య‌క్ర‌మాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. కొత్త ఆవిష్క‌ర‌ణ‌ల‌ను ప్రోత్స‌హించ‌డం, స్టార్ట‌ప్ సంస్కృతిని, నైపుణ్యాభివృద్ధిని పెంపొందించేందుకు విద్యాసంస్థ‌ల‌తో ప‌ర‌స్ప‌ర అవ‌గాహ‌న ఒప్పందాలు కుదుర్చుకుంటున్న‌ట్లు తెలిపారు.

Leave a Reply