Normal Tests – కెసిఆర్ కు వైద్య పరీక్షలు…
హైదరాబాద్ – బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేడు వైద్య పరీక్షలు చేయించుకున్నారు.. దీని కోసం ఆయన హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించారు.. కొంత సేపు హాస్పిటల్లో ఉన్న కెసిఆర్ అనంతరం ఎర్రవెల్లికి బయలుదేరి వెళ్లారు..
మరోవైపు కేసీఆర్ చాలా రోజుల తర్వాత నిన్న బహిరంగంగా కనిపించారు. పార్టీ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ… తెలంగాణకు ఎప్పటికీ రక్షణ కవచం బీఆర్ఎస్సేనని చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బంపర్ మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తీర్పు రాబోతోందని… ఆ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతాయని అందరూ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.