ఆంధ్రప్రభ, ప్రతినిధి / యాదాద్రి : యాదాద్రి భువనగిరి జిల్లా (Yadadri Bhuvanagiri District)లో ఆత్మకూరు మండలం (Atmakur Mandal) కూరెళ్ల గ్రామంలో శుక్రవారం పల్లె దవాఖానను కలెక్టర్ హనుమంత రావు (Collector Hanumantha Rao) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎంఎల్హెచ్పీ డాక్టర్ అశోక్ (MLHP Dr. Ashok) విధులకు సరిగా రావడం లేదని తెలుసుకొని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని సస్పెండ్ చేయాలని డీఎంహెచ్వో మనోహర్ (DMHO Manohar)ని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు.


