దండేపల్లి, జాన్23 (ఆంధ్రప్రభ) : కేజీబీవీలో (Kasturba Gandhi Balika Vidyalaya) లో మెనూ పాటించకుండా స్టూడెంట్స్ ను అర్ధకాలితో ఉంచుతూ, ర్యాష్ గా ప్రవర్తిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న స్పెషల్ ఆఫీసర్ తో సిబ్బందిపై స్టూడెంట్స్, పేరెంట్స్ చేసిన ఫిర్యాదుపై డీఈఓ (DEO) తో కలిసి ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు (Prem Sagar Rao) సోమవారం దాదాపు మూడు గంటలకు పైగా స్కూల్ లో విచారణ నిర్వహించారు. ముందుగా స్పెషల్ ఆఫీసర్, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను విచారించి స్టూడెంట్స్ ను విచారించారు. స్పెషల్ ఆఫీసర్ మంజుల, అసిస్టెంట్ కుక్, వాచ్ విమెన్, స్కావేంజర్ తమ పట్ల ర్యాష్ గా ప్రవర్తిస్తు తమ పట్ల, తమ పేరెంట్స్ పట్ల బూతు మాటలు కూడా అంటున్నారని, తమతోనే టాయిలెట్స్, గ్రౌండ్, వాటర్ ట్యాంక్ తదితర క్లీనింగ్ పనులు చేపిస్తున్నారని విస్తూపోయే విషయాలు చెప్పారు.
ప్రభుత్వ మెనూ ప్రకారం వారంలో మూడు సార్లు ఎగ్స్, రెండు సార్లు చికెన్, కిచిడి పెట్టాల్సి ఉండగా, వంద 50 మంది తినే ఫుడ్ 100 మందికి పైగా వడ్డీస్తున్నారని, అది కూడా కేవలం నీళ్ల చికెన్ సూపు ఒక రోజు, ఒక రోజు ఎగ్స్, నీళ్ల టమాటా, ఉడికి ఉడకని అన్నం వడ్డిస్తుండడంతో అర్ధాకలితో అలమటిస్తున్నామని, దీంతో చదువుకోవడం కూడా ఇబ్బందిగా మారిందని స్టూడెంట్స్ ఆవేదనతో తెలిపారు. విచారణ అనంతరం స్పెషల్ ఆఫీసర్ మంజులతో పాటు వర్కర్స్ భారతి, నీల, లక్ష్మీ లను వెంటనే సర్వీస్ రిమూవల్ చేయాలని డీఈఓకు సిఫారస్ చేయడంతో నివేదికను జిల్లా కలెక్టర్ కు పంపిస్తూ బాధ్యులైన సిబ్బందిని స్కూల్ నుంచి వెళ్లిపోవాలని, ఎంఈఓ చిన్నయ్య ను స్కూల్ పర్యవేక్షించమని డీఈఓ యాదయ్య ఆదేశించారు.