మంచు విష్ణు భారీ బడ్జెట్తో తన స్వంత బ్యానర్లో తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కన్నప్ప’. ఈ చిత్రంలో ఆయనతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్, మధుబాల, బ్రహ్మానందం, మోహన్ బాబు వంటి టాప్ స్టార్స్ నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన టీజర్లు, సాంగ్స్తో సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. తాజాగా విడుదలైన ట్రైలర్తో ఆ హైప్ మరింత పెరిగింది. గ్రాండియస్ విజువల్స్, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్టన్నింగ్ మేకింగ్తో ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో విష్ణు – ప్రభాస్ మధ్య గొప్ప ఫేస్ ఆఫ్ హైలైట్గా నిలిచింది. కాగా, ‘కన్నప్ప’ మూవీ జూన్ 27న పాన్ ఇండియా రేంజ్లో థియేటర్లలోకి రానుంది.