కర్నూల్ బ్యూరో, జూన్ 14, ఆంధ్రప్రభ : కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్ ను జోనల్ చైర్మన్ పూల నాగరాజు (Nagaraju) శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్టాండులోని ప్రయాణీకులను, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బస్టాండ్ లోని దుకాణాల్లో వస్తువుల విక్రయాలు అధిక ధరలకు విక్రయంపై కొందరు ప్రయాణికులు (Passengers) జోనల్ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. వాటిని విచారించి చర్యలు తీసుకుంటామని జోనల్ చైర్మన్ ప్రయాణికులకు హామీ ఇచ్చారు.
ముఖ్యమంత్రి చొరవతో బస్టాండు (bus stand) లలోని వసతులు మెరుగు పడ్డాయని ప్రయాణీకులు హర్షం వ్యక్తం చేశారు. బస్టాండులోని వసతుల నిర్వహణ పట్ల జోనల్ చైర్మన్ సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు-2 డిపో గ్యారేజీలో మొక్కను నాటారు. గ్యారేజీలో కార్మికులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా కార్మికులు, తమ సమస్యలను జోనల్ చైర్మన్ (Zonal Chairman) దృష్టికి తీసుకువచ్చారు. ఈ సమస్యలపై నాగరాజు సానుకూలంగా స్పందించారు. సంస్థ పరిధిలోని కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ప్రజా రవాణా అధికారిని ఆదేశించారు. ఈ సందర్భంగా జూన్ నెల చైర్మన్ వెంట ఆర్టీసీ ఆర్ఎం టి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.