హైదరాబాద్ : నిజామాబాద్, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, హైదరాబాద్, ఖమ్మం, సిద్దిపేట, హన్మకొండ జిల్లాల ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, డైరెక్టర్లు, కలెక్టర్లు సహా 36 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
ఐఏఎస్ అధికారుల బదిలీలు:
- శశాంక్ గోయల్ – స్పెషల్ సీఎస్గా తెలంగాణ భవన్ (ఢిల్లీ) నుంచి రెసిడెంట్ కమిషనర్గా నియమితులయ్యారు.
- నవీన్ మిట్టల్ – రెవెన్యూ శాఖ నుంచి ఇంధనశాఖకు ముఖ్య కార్యదర్శిగా మార్చారు.
- ఎన్. శ్రీధర్ – సామాజిక సంక్షేమ శాఖ నుంచి పంచాయతీరాజ్ శాఖకు బదిలీ అయ్యారు.
- జ్యోతి బుద్ధ ప్రకాశ్ – రెవెన్యూ శాఖ నుంచి గృహ నిర్మాణశాఖకు కార్యదర్శిగా నియమితులయ్యారు.
- లోకేష్ కుమార్ – అడిషనల్ సీఈవోగా ఉన్న ఆయనను రెవెన్యూ ముఖ్య కార్యదర్శిగా నియమించారు.
- గౌరవ్ ఉప్పల్ – ఢిల్లీ తెలంగాణ భవన్ సమన్వయకర్తగా కొనసాగుతారు.
- భారతి లక్పతి నాయక్ – పీఈ శాఖ నుంచి సమాచార కమిషన్కు బదిలీ అయ్యారు.
- శివకుమార్ నాయుడు – జీహెచ్ఎంసీ నుంచి ఆర్ అండ్ ఆర్ కమిషనర్గా బదిలీ అయ్యారు.
- రాజీవ్ గాంధీ హన్మంతు – నిజామాబాద్ కలెక్టర్గా ఉన్న ఆయనను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ప్రత్యేక కార్యదర్శిగా నియమించారు.
- శ్రీజన – మహిళా శిశు సంక్షేమశాఖ ఇన్చార్జిగా మారారు.
- శివశంకర్ లోతేటి – వ్యవసాయ సహకారశాఖ జాయింట్ సెక్రటరీగా నియమితులయ్యారు.
- వల్లూరి క్రాంతి – పర్యాటకశాఖ ఎండీగా నియమితులయ్యారు.
- చౌహాత్ బాజపల్ – వరంగల్ మున్సిపల్ కమిషనర్గా మారారు.
- శంకరయ్య – సీడీఎంఏ అదనపు డైరెక్టర్గా ఉన్న ఆయనను తెలంగాణ ఆయిల్ ఫెడ్ ఎండీగా నియమించారు.
- ప్రొ. శ్రీకాంత్ – ఆయుష్ డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అందుకున్నారు.
- పవన్ కుమార్ – టీజీఐఐసీ ఈవోగా నియమితులయ్యారు.
- చిట్టెం లక్ష్మీ, నిఖిల్ చక్రవర్తి, వీఎస్ఎన్వీ ప్రసాద్ తదితరులు కూడా వివిధ శాఖలకు బదిలీ అయ్యారు.
జిల్లాల కలెక్టర్ల మార్పులు:
- దాసరి హరిచందన – ఆర్ అండ్ బీ శాఖ నుంచి హైదరాబాద్ కలెక్టర్గా నియమితులయ్యారు.
- టీ. వినయ్ కుమార్ రెడ్డి – నిజామాబాద్ కలెక్టర్గా నియమితులయ్యారు.
- ప్రావిణ్య – హన్మకొండ నుంచి సంగారెడ్డి కలెక్టర్గా బదిలీ అయ్యారు.
- మిక్కిలినేని మనూ చౌదరి – మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నారు.
- అనుదీప్ దురిశెట్టి – హైదరాబాద్ నుంచి ఖమ్మం కలెక్టర్గా బదిలీ అయ్యారు.
- ముజామిల్ ఖాన్ – ఖమ్మం కలెక్టర్గా ఉన్న ఆయన సివిల్ సప్లైస్ డైరెక్టర్గా బదిలీ అయ్యారు.
- స్నేహ శబరీష్ – జీహెచ్ఎంసీ నుంచి హన్మకొండ కలెక్టర్గా బదిలీ అయ్యారు.
- హైమావతి – సిద్ధిపేట కలెక్టర్గా నియమితులయ్యారు.
ఈ బదిలీలతో పాలనలో మరింత సమర్థతను తీసుకురావడమే లక్ష్యమని ప్రభుత్వం వెల్లడించింది.