మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రహమత్ నగర్లో ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది.
తిరుమలగిరి పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సాయి కుమార్ (35) రహమత్ నగర్లోని బంగారు మైసమ్మ ఆలయం సమీపంలో నివసిస్తున్నారు. సాయి కుమార్ మంగళవారం ఉదయం ఇంట్లో తన గదిలో బెల్టుతో ఉరి వేసుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు. గమనించిన అతని తల్లి… బిగ్గరగా కేకలు వేయడంతో స్థానికులు అతన్ని రక్షించి ఆసుపత్రికి తరలించారు.
కాగా, సాయికుమార్ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని, అతని ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. ఎటువంటి ఫిర్యాదు అందకపోవడంతో కేసు నమోదు చేయలేదని పోలీసులు తెలిపారు.