Telangana |ప్రసవాల్లో తాండూర్ ఆసుపత్రి కి టాప్ ప్లేస్ : డాక్టర్ ఆనంద్

వికారాబాద్ మే 6 ( ఆంధ్రప్రభ): ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య రోజురోజుకు పెరుగుతుందని సాధారణ ప్రసవాలకు వైద్యులు ప్రాధాన్యతరిస్తున్నారని వికారాబాద్ డి సి హెచ్ డాక్టర్ టి ఆనంద్ తెలిపారు. నూతనంగా డీసిహెచ్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వికారాబాద్ జిల్లాలోని వైద్య విధాన పరిషత్ పరిధిలో గల వికారాబాద్ తాండూర్ పరిగి కొడంగల్ మర్పల్లి బషీరాబాద్ ఆసుపత్రుల్లో ప్రజలకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పిస్తున్నట్టు తెలిపారు.

ప్రధానంగా తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో గల మాతా శిశు ఆసుపత్రిలో 24 గంటల పాటు 8 మంది గైనకాలజిస్ట్ డాక్టర్లు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు తెలంగాణ రాష్ట్రంలో తాండూర్ ప్రభుత్వ ఆసుపత్రి ప్రథమ స్థానంలో నిలిచిందని ఆయన తెలిపారు ప్రసవాల సంఖ్య లో సాధారణ ప్రసవాలు 60 శాతం ఉండగా సిజేరియన్ 40 శాతం ఉంటాయని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యధిక శాతం సాధారణ ప్రసవా లు జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు

ప్రధానంగా రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రత నేపథ్యంలో ప్రజలు ఐస్ క్రీమ్ కూల్ డ్రింక్స్ లాంటివాడిని తీసుకోకుండా తమ ఇంట్లో గల మంచినీటి కుoడల్లో గల నీటిని వాడాలని ఫ్రిడ్జ్లోని వస్తువులను వాడకూడదని సూచించారు. ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించటం కోసం తనవంతు కృషి చేస్తానని ఆయన స్పష్టం చేశారు.

Leave a Reply