ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ లో భాగంగా నేడు మరో ఆసక్తికర పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. ఈరోజు (ఆదివారం) ముల్లన్పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు తలపడనుంది. అయితే, ఈ మ్యాచ్ లో ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటీదర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
తుది జట్లు :
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లి, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), రొమారియో షెపర్డ్, టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, సుయాష్ శర్మ, జోష్ హేజిల్వుడ్, యశ్ దయాల్.
పంజాబ్ కింగ్స్ : ప్రియాంష్ ఆర్య, ప్రభ్సిమ్రాన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, అర్ష్దీప్ సింగ్, జేవియర్ బార్ట్లెట్, యుజ్వేంద్ర చాహల్