బరిలోకి భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు
ఐసిసి మహిళల ప్రపంచ కప్ 2025కు ముందు ఉత్కంఠభరితమైన మహిళల ట్రై నేషన్ వన్డే సిరీస్ కు రంగం సిద్ధమైంది. మహిళల ట్రై-నేషన్ వన్డే క్రికెట్ టోర్నమెంట్ ఏప్రిల్ 27 నుండి ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్లో భారత్, శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. కాగా, ఈ ట్రై-నేషన్ సిరీస్కు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది.
కాగా, ఈ సిరీస్ లో ప్రతి జట్టు నాలుగు మ్యాచ్లు ఆడనుండగా… టాప్-2 జట్లు ఫైనల్కు అర్హత సాధిస్తాయి. ఫైనల్ మే 11న జరుగుతుంది.
మ్యాచ్ల షెడ్యూల్
- ఏప్రిల్ 27: భారత్-శ్రీలంక
- ఏప్రిల్ 29: భారత్-దక్షిణాఫ్రికా
- మే 1: శ్రీలంక-దక్షిణాఫ్రికా
- మే 4: శ్రీలంక- భారత్
- మే 6: భారత్-దక్షిణాఫ్రికా
- మే 8: శ్రీలంక-దక్షిణాఫ్రికా
- మే 11: ఫైనల్.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది చివర్లో భారత్ లో జరగనున్న ఐసిసి మహిళల ప్రపంచ కప్కు ముందు ఈ ట్రై నేషన్ సిరీస్ మూడు జట్లకు కీలకమైన వార్మప్ ఈవెంట్గా ఉపయోగపడుతుంది.