33వేల 606 విలువ గల 8 టేకు దుంగలను స్వాధీనం..
దండేపల్లి, ఆంధ్రప్రభ : దండేపల్లి మండలంలోని కొత్తమామిడిపల్లి గ్రామనికి చెందిన దనిశెట్టి కార్తిక్ అలియాస్ లడ్డు(Danisetty Karthik alias Laddu) ఇంటి పై నమ్మాదగిన సమాచారం మేరకు తాళ్ళపేట రేంజ్ ఆఫీసర్ సుస్మరావు ఆధ్వర్యంలో ఈ రోజు డాగ్ స్క్వాడ్ సహాయంతో రైడింగ్ చేసి ఇంట్లో నిల్వఉంచిన 33వేల 606 విలువ గల 8 టేకు దుంగలను(teak logs) స్వాధీనం చేసుకుని ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తాళ్ళపేట రేంజర్ తెలిపారు.
అనంతరం పట్టుకున్న కలపను తాళ్ళపేట రేంజి(Tallapet Range)కి తరలించారు, ఈ రైడింగ్లో అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ లు రాజేందర్, నాయదా, శంకర్, డాగ్ స్క్వాడ్ అనిల్, హంటర్(డాగ్) బీట్ ఆఫీసర్ సాయి, బేస్ క్యాంపు సిబ్బంది పాల్గొన్నారు.

