3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి..

3 నెలల రేషన్ బియ్యం ఒకేసారి..
- సద్వినియోగం చేసుకోవాలి
- సర్పంచ్ సౌజన్య రాజుగౌడ్
సంస్థన్ నారాయణపురం, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న ఉచిత రేషన్ బియ్యాన్ని లబ్ధిదారులు ప్రతినెల రేషన్ షాప్ కు వెళ్లి తెచ్చుకునే పరిస్థితులలో వేసవికాలంలో రోజురోజుకు పెరుగుతున్న ఎండలను దృష్టిలో పెట్టుకొని రేషన్ సరుకులు తెచ్చుకునే క్రమంలో ప్రజలు వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఉంటాయని ముందే గ్రహించిన పేదల పెన్నిధి, భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏప్రిల్,మే,జూన్ 3నెలలరేషన్ బియ్యం ఒకేసారి ఇప్పించేందుకు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని అల్లందేవిచెరువు గ్రామ సర్పంచ్ సుర్వి సౌజన్య రాజు గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.
