హృదయంలో ఉన్న పరమాత్మను చూడగలిగిన వారు కాళికి, గంగకు, యమునకు, బదిరికి వెళ్లాల్సిన పనిలేదు.
యమో వైస్వతో రాజా
యస్తవైశ హృది స్థితి:
తేనచేత్ అవిదా దస్త్
మా గంగామ్ మా కురూంగమ:
అందరిని నియమించువాడు, సూర్యభగవానుని మధ్యలో ఉండి అందరినీ రంజింపజేయు నారాయణుడు మీ #హృదయంలోనే ఉన్నాడు. అతనితో వివాదం లేకుంటి గంగకు, కురుక్షేత్రానికి వెళ్లాల్సిన పనిలేదని భావము.
ప్రతి ప్రాణి హృదయంలో పరమాత్మ నెలకొని ఉన్నాడు. అనగా పశుపక్ష్యాదులు, చెట్టు, పుట్ట, గుట్టలలో అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు. ఈ సత్యం తెలిసిన వారు పశుపక్ష్యాదులను హింసించరు. మాంసాహారం భుజించరు. ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడన్న భావం లేనివారు, ఆవిధంగా చూడలేని వారు హృదయంలో పరమాత్మ స్వరూపాన్ని చూడడానికి ఉపాయంగా దేవాలయాలకు, పుణ్యక్షేత్రాలకు, పుణ్య తీర్థాలకు వెళ్తారు. పుణ్యక్షేత్రాలకు వెళ్లినవారు కూడా పరమాత్మ అర్చామూర్తి ఎదుట కనులు మూసుకుని ఎదురుగా ఉన్న మూర్తిని హృదయంలో చూస్తారు.
హృదయంలోనే పరమాత్మ ఉన్నప్పుడు మరల బయటచూడటం ఎందుకు?
