చిట్యాల, ఏప్రిల్ 1 (ఆంధ్రప్రభ) : గత ప్రభుత్వంలో నిరుపేదలకు రేషన్ షాపుల ద్వారా దొడ్డు బియ్యం సరఫరా చేశారని, కాంగ్రెస్ ప్రజాపాలన ప్రభుత్వం రేషన్ దోపిడీ మాఫియాకు అడ్డుకట్ట వేసి, నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేయడం జరుగుతుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. మంగళవారం జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని వెంకట్రావు పల్లి (సి) రెండవ రేషన్ షాప్ లో లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ఎమ్మెల్యే జీఎస్సార్ ప్రారంభించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం ప్రతీ నిరుపేద కుటుంబానికి సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రజా ప్రభుత్వంలో పేద కుటుంబాలందరికీ సన్నబియ్యం పంపిణీ చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి, రేషన్ కార్డులోని ఒక్కో కుటుంబ సభ్యునికి, ఆరు కిలోల చొప్పున సన్నబియ్యంను అందించడం అభినందనీయమన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనప్పటికీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ సంవత్సరంన్నర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేసి చూపెట్టారని ఎమ్మెల్యే అన్నారు. గతంలో రేషన్ బియ్యం పంపిణీ మాఫియాలు ఉండేవని, ఇప్పుడు వాటిని శాశ్వతంగా నిర్మూలించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సివిల్ సప్లై డిసీఎస్ ఓ శ్రీనాథ్, జిల్లా మేనేజర్ రాములు, ఏసిఎస్ఓ వేణుగోపాల్, తహశీల్దార్ నల్లబెల్లి హేమ, సివిల్ సప్లై ఇన్స్పెక్టర్ భాస్కర్ల రాజు, మార్కెట్ డైరెక్టర్ లక్ష్మి, రేషన్ డీలర్ బుర్ర సదయ్య, కాంగ్రెస్ జిల్లా, మండల, నాయకులు గూట్ల తిరుపతి, ముకిరాల మధువంశీకృష్ణ, కామిడీ రత్నాకర్ రెడ్డి, దొడ్డి కిష్టయ్య, చిలుకల రాయ కోమురు, గడ్డం కొమురయ్య, దబ్బెట అనిల్, బుర్ర శ్రీనివాస్ గౌడ్, బుర్ర లక్ష్మణ్ గౌడ్, నాయకులు, కార్యకర్తలు, రేషన్ డీలర్లు లబ్ధిదారులు పాల్గొన్నారు.
