Warning | వచ్చేది బీఆర్ఏస్సే – వేధిస్తున్న ప్రతి పోలీస్ లెక్క తెలుస్తాం – కెసిఆర్

.ఎల్కతుర్తి : సభకు తరలి వస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను, ప్రజలను పోలీసులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు కెసిఆర్. వరంగల్ లోని ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ రజతోత్సవర బహిరంగ సభలో గులాబీ బాస్ కేసీఆర్ ప్రసంగిస్తూ , పోలీసులు ఎందుకు తొందర పడుతున్నారు.. బీఆర్ఎస్ సోషల్ మీడియా యాక్టివిస్టులను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు.. పోలీసులు ఇవాళ డైరీలో రాసుకోవాలి.. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్సే.. ఇది ఆపడం ఎవరితరం కాదు.. మా కార్యకర్తలను, నేతలను, ప్రజలను ఇబ్బంది పెట్టిన ప్రతి పోలీస్ లెక్క అధికారం లోకి వచ్చిన వెంటనే తెలుస్తాం అంటూ గులాబీ బాస్ ఘాటుగా హెచ్చరించారు

20 శాతం ప్రభుత్వం కాంగ్రెస్ ది.

ఇక నుంచి నేను బయలుదేరతా.. ఎవరి లెక్కలు ఏంటో తీద్దాం.. కాంగ్రెస్ నయవంచక ప్రభుత్వం.. కరెంట్ సరఫరా, రైతుబంధు, ధాన్యం కొనుగోళ్లలో, భూముల ధరలు పెంచడంలో ఫెయిల్.. అబద్ధపు వాగ్ధానాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం, 20-30 శాతం కమీషన్లు తీసుకోవడమే కాంగ్రెస్ పని అని కేసీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు గోల్‌మాల్ చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదు. ఇక్కడ ఉన్నోళ్ళు చాలరని, ఢిల్లీ నుండి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చి స్టేజీల మీద చప్పట్లు కొట్టి, డాన్సులు వేసి మరీ లేనిపోని హామీలు ఇచ్చారు.

కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు ముందు ఎన్నో చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చిన నకిలీ గాంధీలు ఎన్నో హామీలిచ్చారు. మేము పింఛను రూ.2 వేలు ఇస్తే.. కాంగ్రెస్ వాళ్లు రూ.4 వేలు ఇస్తామన్నారు. ఇచ్చారా ?. మేము రైతు బంధు రూ.10 వేలు ఇస్తే.. వాళ్లు రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇచ్చారా

చదువుకునే విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఇచ్చారా?. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. చేశారా ?. కల్యాణలక్ష్మీ స్కీమ్తో రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామన్నారు. ఇచ్చారా ?. ఇప్పటికీ కూడా పించన్లు ఏమాత్రం పెరగలేదు. రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదు. ఎన్నో హామీలిచ్చి ప్రజలను తప్పుదారి పట్టించారు. ఉచిత బస్సులు పెట్టి మహిళలు జుట్లు పట్టుకొనే పరిస్థితి తీసుకొచ్చారు. 2014 కు ముందున్న పరిస్థితులు మళ్లీ వచ్చాయంటూ” కేసీఆర్ ధ్వజమెత్తారు

కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయడం మీ తరమా?

తన ప్రసంగంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలని చూస్తున్నారు.. ఇది సాధ్యమా.. మన సభకు ప్రజలు రాకుండా అనేక ఆటంకాలు సృష్టిస్తున్నారు.. బీఆర్ఎస్ సభల్ని ఆపుతారా.. ఈ ప్రభంజనాన్ని ఎలా ఆపుతారు.. కేసీఆర్ కిట్స్ ను ఎందుకు బంద్ చేశారు.. ఎవరైనా వాటిని ఆపుతారా.. ప్రభుత్వం నడపడం చేతకాక.. ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు.. వైఎస్సాఆర్ ఆరోగ్యశ్రీని తీసుకొచ్చారు.. అది మంచి పథకమని నేను కొనసాగించాను.. ఆరోగ్య శ్రీ పథకం పేరు కూడా మార్చకుండా.. మేము కొనసాగించామని కేసీఆర్ వెల్లడించారు.

కానీ, ప్రస్తుతం తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కేసీఆర్ కిట్స్ ను ఎందుకు బంద్ చేశారు అని అడిగారు. ఎవరైనా వాటిని ఆపుతారా.. పేదల కోసం తీసుకొచ్చి ఈ పథకాన్ని ఆపడం దారుణమని పేర్కొన్నారు. కాంగ్రెస్ కు ప్రభుత్వం నడపడం చేతకాక.. రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *