Visakha | రామానాయుడు స్టూడియోస్ కు సుప్రీంలో దక్కని ఊరట

విశాఖ‌ప‌ట్నం – ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ రామానాయుడు స్టూడియో కి సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. విశాఖ భూముల వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోలేమంటూ ఆ సంస్థ పిటిష‌న్ కొట్టివేసింది.. వివ‌రాల‌లోకి వెళితే విశాఖలోని ఫిల్మ్ సిటీ రామానాయుడు స్టూడియో భూములలో ఇత‌ర అవ‌స‌రాల‌కు సైతం వాడుకోవ‌చ్చ‌ని గ‌త జ‌గ‌న్ ప్ర‌భుత్వం అనుమ‌తి ఇచ్చింది.. దీంతో అక్క‌డ రామానాయుడు స్టూడియోస్ అనుబంధ సంస్థ సురేష్ ప్రొడ‌క్ష‌న్ కు అక్క‌డ ఇత‌ర నిర్మాణాల‌ను చేప‌ట్టింది. ఆ త‌ర్వాత కూట‌మి ప్ర‌భుత్వం రావ‌డంతో గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని ప్రస్తుత ప్రభుత్వం షోకాజ్ నోటీసు ఇచ్చింది. దీన్ని సురేష్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈక్రమంలో నేడు విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం.. పిటిషన్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. మధ్యంతర ఉపశమనం కుదరదని చెప్పింది. ఆ పిటిష‌న్ కొట్టి వేసింది.. ఈ తీర్పుతో రామానాయుడుకి స్టూడియోకి కేటాయించిన భూముల‌ను టిడిపి ప్ర‌భుత్వం స్వాధీనం చేసుకునేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ట్లైంది.

Leave a Reply