AP | పవన్ కల్యాణ్‌ను కలిసిన వీహెచ్ !

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు భేటీ అయ్యారు. మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను వీహెచ్ కలిశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వీహెచ్‌ని శాలువాతో సత్కరించి, వినాయకుడి విగ్రహాన్ని బహూకరించారు.

అయితే, ఈ భేటీ సందర్భంగా.. కర్నూలు జిల్లాకు దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని వీహెచ్ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా దామోదరం సంజీవయ్య బాధ్యతలు నిర్వర్తించారని వీహెచ్ గుర్తు చేశారు.

సామాజిక పింఛన్లు, కార్మికులకు పలు ప్రయోజనాలు కల్పించడంలో సంజీవయ్య పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన పేరిట స్మారక భవనాన్ని నిర్మించాలన్నారు. ఈ అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తానని పవన్ కల్యాణ్ వీహెచ్‌కు హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *