TG | శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న కేంద్ర మంత్రి బండి సంజయ్

వేములవాడ : దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సన్నిధిలో జరుగుతున్న మహా శివరాత్రి మహోత్సవ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ బుధవారం పాల్గొన్నారు. కేంద్ర మంత్రి ఆలయ ఆవరణలోకి రాగానే ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలో కొలువుదీరిన శ్రీ స్వామివారలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

అంతకుముందు వేద మంత్రోఛరణల మధ్య స్వామివార్లకు శేష వస్త్రాలను సమర్పించారు. దర్శనానంతరం కేంద్ర మంత్రి బండి సంజయ్ కి ఆలయ అర్చక బృందం ఆశీర్వచనం గావించి స్వామివారి చిత్రపటం, మహా ప్రసాదాన్ని అందజేసి సత్కరించారు. భారతదేశ ప్రజలంతా సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో విరాజిల్లాలని స్వామివారిని వేడుకున్నట్లు బండి సంజయ్ తెలిపారు .ఆయన వెంట ఆయన వెంట భాజపా నాయకులు ప్రతాపరామకృష్ణ, గోపి, బండ మల్లేశం ,గోపు బాలరాజు, రాపల్లి శ్రీధర్ ,అల్లాడి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *