కేంద్ర మంత్రి రామ్మోహన్నాయుడుతో…

ఢిల్లీ, ఆంధ్రప్రభ : కొత్తగూడెం (Kothagudem) లో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఏర్పాటుపై కేంద్రపౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Ram Mohan Naidu) తో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummla Nageswara Rao) చర్చించారు. ఈ రోజు ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. భద్రాద్రి కొత్తగూడెంలో కొత్త విమానాశ్రయం (New Airport) ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రామ్మోహన్ తెలిపారని తుమ్మల చెప్పారు.
