TTD | మే 01 నుండి వీఐపీ బ్రేకు దర్శనాల్లో మార్పు !

శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం మే 1వ తేదీ నుండి టీటీడీ పలు కీలక నిర్ణయాలను అమలు చేయనుంది. వేసవి సెలవుల నేపథ్యంలో ఇప్పటికే తిరుమలకు భక్తుల రద్దీ పెరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించడంలో భాగంగా మే 1వ తేదీ నుండి జూలై 15వ తేదీ వరకు, వీఐపీ బ్రేక్ దర్శనాలు కేవలం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే టీటీడీ పరిమితం చేయనుంది. అదేవిధంగా మే 1వ తేదీ నుండి స్వయంగా వచ్చే ప్రోటోకాల్ విఐపిలకు వీఐపీ బ్రేక్ దర్శనాలు ప్రయోగాత్మకంగా ఉదయం 6 గంటల నుండి అమలు చేయనుంది.

Leave a Reply