ADB | పులుల సంరక్షణ అందరి బాధ్య‌త‌.. ఎఫ్డీఓ రామ్మోహన్

జన్నారం, జూన్ 23 (ఆంధ్రప్రభ): పెద్దపులుల, అడవుల, వన్యప్రాణుల సంరక్షణకు అందరి సహకారం ఎంతో అవసరమని స్థానిక నూతన ఎఫ్డీఓ ఎం.రామ్మోహన్ (Rammohan) అన్నారు. మంచిర్యాల జిల్లా కవ్వాల టైగర్ (Tiger) రిజర్వ్ లోని జన్నారం అటవీ డివిజనల్ అధికారి (ఎఫ్డీఓ)గా ఆయన సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మానవాళి మనుగడకు వన్యప్రాణులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పెద్దపులు ఉంటే అడవులు, వన్యప్రాణులు ఉంటాయన్నారు.

జీవ వైవిధ్యంలో ప్రాణికోటిలో ఒక్కదానిపై ఒకటి ఆధారపడి మనుగడ సాగిస్తాయని ఆయన చెప్పారు.మానవులు స్వార్థం కోసం అడవులను, వన్యప్రాణులను హతమారుస్తున్నారని ఆయన తెలిపారు. ప్రజా ప్రతినిధుల,ప్రజల, నాయకుల,అధికారుల సహకారంతో కవ్వాల టైగర్ రిజర్వ్ ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అనంతరం తాళ్లపేట ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జన్నారం ఇన్చార్జి వి.సుష్మారావు, ఇందనపల్లి రేంజ్ ఆఫీసర్ కారం శ్రీనివాస్, స్థానిక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ మమత, ఫారెస్ట్ సెక్షన్,బిట్ ఆఫీసర్లు హన్మంతరావు,శివకుమార్, లాల్భాయ్,లవన్ కుమార్, కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు సరిత,క్రాంతి కుమార్,తదితరులు స్వీట్లు,పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు.

Leave a Reply