Nawabupeta | చలివాగు చెక్ డ్యాంకు గండికొట్టిన దుండ‌గులు

చిట్యాల, ఫిబ్రవరి 27 (ఆంధ్రప్రభ) : జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని నవాబుపేట చలివాగుపై, నిర్మించిన చెక్ డ్యాంకు గుర్తుతెలియని వ్యక్తులు గండికొట్టారు. దీంతో నీరు టేకుమట్ల మండలంలోని పలు గ్రామాలకు చలివాగు ప్రవహిస్తుంది.

శివారులోని పంట పొలాలకు సాగునీటి కోసం రైతులు ఈ పని చేసి ఉండొచ్చని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో చలివాగులో స్టోర్ అయిన నీళ్లు మొత్తం కింది ప్రాంతానికి వెళ్లే అవకాశం ఉందని, కాగా పైన పంటలు వేసుకున్న పొలాల రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *