TG | కరెంట్ షాక్ తో ముగ్గురు మృతి
కరెంట్ షాక్ తో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతిచెందిన విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. భూమాతను నమ్ముకుని సేద్యం చేసే ఓ రైతు కుటుంబం కరెంట్ షాక్ కు బలైంది. ఈ సంఘటన గురువారం ఉదయం నిజామాబాద్ జిల్లా పెగడాపల్లి గ్రామ శివారులోని పంట పొలాల్లో జరిగింది. రెంజల్ మండలం సాటాపూర్ గ్రామానికి చెందిన దంపతులు రైతు దంపతులు గంగారం (45), బాలమణి (40) లతో పాటు వారి కొడుకు కిషన్ (22) లు వారి పొలానికి నీరు పడుతుండగా బోరు మోటార్ వద్ద కరెంట్ షాక్ తగిలింది.
మొదట గంగారాంకు షాక్ తగలడంతో పక్కనే ఉన్న భార్య బాలమణి భర్తను కాపాడ బోయి ఆమె కూడా కరెంట్ షాక్ కు గురయ్యింది. కొంచెం దూరంలో ఇది గమనించిన కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి తల్లిదండ్రులను కాపాడేందుకు ఇద్దరిని లాగబోయాడు. వెంటనే కొడుకు కూడా షాక్ కు గురికాగా ముగ్గురు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఘటనా స్థలాన్ని బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు, ఎస్ఐ మచ్చేందర్ సందర్శించి కేసు నమోదు చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ ఘటనతో సాటాపూర్ గ్రామంలో విషాదం నెలకొంది.