TG | పెద్దపల్లి లో విషాదం.. పిల్లలను చంపి మహిళ ఆత్మహత్య

పెద్దపల్లి, ఆంధ్రప్రభ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఈరోజు (బుధవారం) విషాదం ఘ‌ట‌న చోటుచేసుకుంది. ఒక వివాహిత తన మూడేళ్ల బిడ్డకు ఉరి వేసి, ఆపై ఆమే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

పట్టణంలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న లోకా సాహితి రెడ్డి (27), తన కుమార్తె వీతన్య రెడ్డి (3)కి ఉరి వేసి ఆపై త‌ను ఉరివేసుకొని బలవన్మ రణానికి పాల్పడింది.

మృతురాలి భర్త వేణుగోపాల్ రెడ్డి ఎల్ఐసీలో పనిచేస్తున్నాడు. కరీంనగర్ జిల్లాలోని వెధిర గ్రామానికి చెందిన సాహితిని నాలుగు సంవత్సరాల క్రితం వివాహం చేసుకున్నారు.

ఆత్మహత్యకు గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అయితే, సాహిత్య కొంతకాలంగా మానసికంగా బాగాలేదని సమాచారం. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పెద్దపెల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *