హైదరాబాద్ : కాళేశ్వరం కమిషన్ ( Kaleswaram Commission) విచారణలో రేపు కీలక ఘట్టం జరగబోతోంది. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (KCR) బుధవారం ఉదయం 11 గంటలకు జస్టిస్ పీసీ ఘోష్ ( Justice PC Ghosh) కమిషన్ ముందు విచారణకు హాజరుకాబోతున్నారు. అయితే ఈ విచారణ ఇన్ కెమెరాగా జరగనంది. మాజీ ముఖ్యమంత్రి హోదా లో సాక్షి గా ( Witness) ఈ విచారణ కు హాజరు కానున్నారు కెసిఆర్.
ఇంతకీ మాజీ సీఎంని కాళేశ్వరం కమిషన్ ఏం ప్రశ్నలు అడగబోతోంది? కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి జస్టిస్ పీసీ ఘోష్ ఎలాంటి అంశాలను లేవనెత్తబోతున్నారు? కమిషన్ అడిగే ప్రశ్నలకు గులాబీ బాస్ ఎలాంటి సమాధానాలు చెప్పబోతున్నారు?
ఇప్పుడు ఇవే అందరిలోనూ ఆసక్తి రేపుతున్న అంశాలు. కాళేశ్వరం కమిషన్ కున్న అనుమానాలు ఏంటి? కేసీఆర్ ను ఏయే ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టబోతోందని ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం కమిషన్ విచారణ తుది అంకానికి చేరుకుంది. దాదాపు ఏడాది కాలంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించిన విచారణ జరుపుతున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని విచారించబోతోంది