హైదరాబాద్ : 15 నెలల రేవంత్ పాలనలోని వైఫల్యాలను మరింత సమర్దవంతంగా ప్రజల ముందుకు తీసుకెళ్లాలని బిఆర్ఎస్ అదినేత కెసిఆర్ పార్టీ నేతలను కోరారు.. ఇప్పటికే కొత్తగా అధికారంలోకి వచ్చిన రేవంత్ ఇప్పటికే తగినంత సమయం ఇచ్చామని, ఇక ఉపేక్షించాల్సి అవసరం లేదని తేల్చి చెప్పారు..

బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ మహాసభ నేపథ్యంలో అధినేత కేసీఆర్ అధ్యక్షతన, హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాల పార్టీ ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నేడు ఎర్రవెల్లి నివాసంలో జరిగింది. ఈ సమావేశంలో వరంగల్లో నిర్వహించే పార్టీ రజతోత్సవ మహాసభ గురించి నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. జన సమీకరణతో పాటు పలు కీలక అంశాలపై కేసీఆర్ వారితో చర్చించారు.

ఈ సందర్భంగా కెసిఆర్ మాట్లాడుతూ, ప్రజాపాలన అంటూ ప్రజలను కాంగ్రెస్ సర్కార్ అష్టకష్టాలకు గురిచేస్తున్నదని అన్నారు.. పథకాలలో కోతలు పెడుతూ ప్రజలను ఇబ్బంది పెడతున్నదని అన్నారు.. ఇందిరమ్మ రాజ్యంలో ఏ ఒక్కవర్గం సంతోషంగా లేదని కెసిఆర్ అభిప్రాయపడ్డారు. ఈ అంశాలనే గ్రామ స్థాయి ప్రజలకు సైతం తెలిసి విధంగా గులాబీ శ్రేణులు ప్రచారం చేయాలని పిలుపు ఇచ్చారు..

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నవీన్, వాణిదేవి, ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, మాధవరం కృష్ణారావు, పద్మారావు, మాగంటి గోపీనాథ్, బండారి లక్ష్మారెడ్డి, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, ముఠా గోపాల్, మర్రి రాజశేఖర్ రెడ్డి, కాలేరు వెంకటేశ్, మాజీ ఎమ్మెల్యేలు కొప్పుల మహేష్ రెడ్డి, మెతుకు ఆనంద్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, పైలట్ రోహిత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు కార్తీక్ రెడ్డి, మన్నె గోవర్ధన్, ముఠా జైసింహా, మాజీ చైర్మన్ క్రిశాంక్ మన్నెతో పాటు తదితరులు పాల్గొన్నారు.