TG | అందాల భామ‌ల‌ను కాదు ..అన్న‌దాత‌ల‌ను ఆదుకోండి : రేవంత్ కు హరీశ్ రావు చురకలు

అకాల వ‌ర్షాల‌తో వ‌డ్డ కుప్ప‌ల మీదు అయిదుగురు రైత‌న్న మృతి
రైత‌న్న మ‌ర‌ణాలు ప్ర‌భుత్వ హ‌త్య‌లే
పది రోజులుగా మార్కెట్ యార్డ్ ల‌లో కొనుగోళ్లు జ‌ర‌గ‌ని స్థితి
అందాల పోటీలు అన్నం పెట్ట‌వు
అన్న‌దాత‌లు చనిపోతుంటే మిస్ వ‌రల్డ్ పోటీల‌పై స‌మీక్ష‌లా
రేవంత్ రెడ్డిని నిల‌దీసిన హ‌రీశ్ రావు

సిద్దిపేట – అకాల వ‌ర్షాల‌తో మార్కెట్లో వంద లారీలు ధాన్యం తడిసిపోయి ఉన్నాయని, వడ్ల కుప్పల మీదనే రైతులు ప్రాణాలు వదులుతున్నారని మాజీ మంత్రి, బిఆర్ ఎస్ సీనియ‌ర్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఇప్పటికే ఐదుగురు రైతులు ధాన్యపు కుప్పల మీదనే ప్రాణాలు వదిలారన్నారు. ఇవి సాధారణ మరణాలు కావని, ప్రభుత్వ హత్యలేనని ఆరోపించారు. సిద్ధిపేట మార్కెట్ యార్డ్ లో పర్యటించారు. తడిచిన దాన్యాన్ని పరిశీలించారు. అధికారుల తీరుపై అసహనం వ్యక్తం చేస్తూ, తడిచిన ధాన్యం వెంటనే కొనాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అకాల వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. వారం, పది రోజుల నుంచి కొనుగోలు ప్రక్రియ జరగడం లేదని విమర్శించారు.

అందాల పోటీలు అన్నం పెడుతుందా..
అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ ఈ ప్రభుత్వానికి రైతుల మీద లేదని విమర్శించారు. అందాల పోటీలపై సీఎం రివ్యూల మీద రివ్యూలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. అందాల పోటీలు అన్నం పెడతాయా అని ప్రశ్నించారు. ధాన్యం ఐదు కిలోల తరుగు తీస్తున్నారని.. దీనిపై యాక్షన్ ఏదని అన్నారు. తాలు, తరుగు పేరిట కోతలు పెడుతున్నారని.. ప్రభుత్వం నుంచి రైతులకు దైర్యం చెప్పే మాటలు రావడం లేదన్నారు. సీఎం రేవంత్ రెడ్డి దేవుళ్ళ మీద ఓట్టు పెట్టీ మాట తప్పిన ఫలితమేమో ఈ అకాల నష్టం అనిపిస్తుందన్నారు. సీఎం మాట తప్పడం వల్లే ప్రకృతి పగ పట్టినట్లు కనిపిస్తోందన్నారు.

రైతుల బాధలు పట్టించుకోండి…
దేశంలో అత్యధిక పంట పండిందని గొప్పలు చెప్పడం కాదని.. రైతుల బాధలు పట్టించుకోవాలని హరీష్ రావు ప్రభుత్వాన్ని కోరారు. పండిన పంటను కొనక రైతులను తిప్పలు పెడుతున్నారని.. అయితే డిల్లీకి.. లేకుంటే అందాల పోటీల రివ్యూలు… అందాల పోటీల మీద ఉన్న శ్రద్ధ.. రైతుల మీద లేకుండా పోయిందన్నారు. అకాల ఈదురు గాలులు, వర్షాలకు మామిడి కాయ లేకుండా మొత్తం రాలి పోయిందని అన్నారు. పత్తి రైతుల్ని కూడా ప్రభుత్వం ముంచిందని, పత్తి రైతులకు 20 శాతం మాత్రమే ఏంఎస్‌పికి తీసుకున్నారని.. మిగతా 80 శాతం బ్రోకర్లు, ప్రైవేటు మిల్లర్ల పాలు చేశారని విమర్శించారు. దాదాపు మూడు వేల కోట్ల నష్టం రైతులకు జరిగిందన్నారు.

సీబీఐ విచారణ జరపాలి…

పత్తి రైతులకు జరిగిన అన్యాయంపై సీబీఐ చేత విచారణ జరపాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 48 గంటల్లో వడ్ల పైసలు ఇస్తున్నామని చెబుతున్న మంత్రి నిరూపిస్తారా అని సవాల్ చేశారు. పది రోజులలోపు పైసలు రాడమే లేదన్నారు. బోనస్ అని గొప్పగా చెప్పి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపించారు. రైతు బంధు, రైతు బీమా ఆగిపోయిందని.. తక్షణమే రైతు బంధు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. దేవుడు, చర్చి, దర్గా మీద సీఎంకు నమ్మకం ఉంటే రుణ మాఫీ డబ్బులు వెంటనే విడుదల చేయాలన్నారు. ఈ ప్రభుత్వానికి పరిపాలన సరిగా చేయడంలేదని, పాలన గాలిలో దీపంలా మారిందన్నారు. నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 20 వేల ఇన్పుట్ సబ్సిడీ అందించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.

పత్తి కొనుగోళ్లలో రూ.30 కోట్ల అవినీతి

పత్తి కొనుగోళ్లలో సీసీఐ అధికారులు రూ.3 వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని హరీశ్ రావు ఆరోపించారు..కేవలం 20% పత్తి రైతులకు మాత్రమే మద్దతు ధర వచ్చిందని, 80% పత్తిని బ్రోకర్లు రైతుల దగ్గర తక్కువ ధరకు కొని సీసీఐకు ఎక్కువ ధరకు అమ్ముకున్నారని అన్నారు. ఈ అవినీతికి పాల్పడ్డ సిసిఐ అధికారులపై వెంటనే సిబిై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply