కర్ణాటక మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే గాలి జనార్థన్ రెడ్డిని పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసులో 15 ఏళ్ల విచారణ అనంతరం నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే.
దీంతో గాలి జనార్ధన్ రెడ్డి సహా దోషులను చంచల్ గూడ జైలుకు తరలించారు. నాంపల్లి సీబీఐ కోర్టు ఆవరణలోనే దోషులకు వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు.
ఈ కేసులో ఇప్పటికే గాలి జనార్ధన్ రెడ్డి నాలుగేళ్లు జైలు శిక్ష అనుభవించారు. దీంతో తనకు శిక్ష తగ్గించాలని ఆయన సీబీఐ కోర్టును కోరాడు.
దీంతో గాలి జనార్ధన్ రెడ్డిపై కోర్టు సీరియస్ అయ్యింది. ఇందులో మీరు చేసిన నేరానికి యావజ్జీవ శిక్షకు అర్హులు అని, మీకు పదేళ్లు జైలు శిక్ష ఎందుకు వేయకూడదో చెప్పాలని తిరిగి ప్రశ్నించిన అనంతరం చట్ట ప్రకారం ఏడేళ్ల శిక్షను విధించింది.