Tet | నేటి నుండి టెట్ పరీక్షలు..

Tet | నేటి నుండి టెట్ పరీక్షలు..

Tet | ఒంగోలు, ఆంధ్రప్రభ : జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలను పగడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు(Collector P. Rajababu) అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లో ఆయన ఛాంబర్ లో ఏపీ టెట్ పరీక్షల నిర్వహణ పై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఏపీ టెట్ పరీక్షలు ఈ నెల 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. ఈ నెల 10వ తేదీ నుండి 21వ తేదీ వరకు జిల్లాలో జరిగే టెట్(Tet) పరీక్షలకు 810 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని ఆయన చెప్పారు.

జిల్లాలో టెట్ పరీక్షలు నిర్వహించడానికి 8 కేంద్రాలను ఏర్పాటు చేశామని పరీక్షలు నిర్వహించడానికి ప్రత్యేక అధికారులను కూడా నియమించడం జరిగింది అన్నారు. ఈనెల 10వ తేదీ నుండి జరిగే టెట్ పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్(First Session), మధ్యాహ్నం 3. 30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రెండవ సెషన్ పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని ఆయన చెప్పారు.

టెట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్షా కేంద్రాల్లోకి గంట ముందుగా చేరుకోవాలని ఆయన చెప్పారు. టెట్ పరీక్ష కేంద్రాల్లోకి సెల్ ఫోన్లకు అనుమతి లేదని ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలి అన్నారు.

ఏ.పి.టెట్ పరీక్షలకు ఉదయం పూట 510 మంది విద్యార్థులు సాయంత్రం జరిగే పరీక్షలకు 300మంది అభ్యర్థులు(300 candidates) హాజరుకానున్నట్లు ఆయన చెప్పారు. ఈ నెల10వ తేదీ నుండి 21వ తేదీ వరకు జరిగే ఏపీ టెట్ పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని.. జిల్లాలో టెట్ పరీక్షలు జరిగే కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్యఆరోగ్య శాఖ(Medical and Health Department) అధికారిని కలెక్టర్ ఆదేశించారు.

టెట్ పరీక్షలు నిర్వహించే కేంద్రాలలో అంతరాయ లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని ఆయన విద్యుత్ శాఖ అధికారులకు చెప్పారు. ఈ సమావేశంలో డైట్ ప్రిన్సిపల్ ఎస్. సుబ్బారావు, డిప్యూటీవ్ డి.ఇ. ఓ చంద్రమౌళి, ఏ.డి వరప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply