Telangana … ఆంధ్రప్రభలో ఇంటర్మీడియట్ ఫలితాలు .. లింక్ క్లిక్ చేస్తే క్షణాలలో ఫలితాలు..

హైదరాబాద్, : తెలంగాణ ఇంటర్మీడియట్‌ ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షల 2024-25 ఫలితాలు నేడు విడుదల చేశారు. నాంపల్లిలోని విద్యాభవన్‌లోతెలంగాణ ఇంటర్ ఫలితాల విడుదల కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి, విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితా రానా, ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య హాజరయ్యారు.

ఇంటర్‌లో 65 శాతం ఉత్తీర్ణత

ఇంటర్‌లో ఫ‌స్టియ‌ర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదు కాగా, సెకండియ‌ర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణ‌త న‌మోదైంది. ఇక ఫలితాలలో బాలికలే పై చేయి సాధించారు.


ఇక పరీక్షలు రాసిన విద్యార్థులు, వారి తల్లి దండ్రులు ఫలితాల కోసం బోర్డు అధికారిక వెబ్‌సైట్

https://tgbie.cgg.gov.in

నుంచి ఫలితాలను నేరుగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

అలాగే

ఐవీఆర్‌ పోర్టల్‌ 9240205555

ఫోన్‌నంబర్‌ ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు.

మే 22 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు

 మే 22 నుంచి ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఉంటాయని.. రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇంటర్ బోర్డు వారం గడువు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. కాగా, ఇంటర్ మొదటి , రెండవ సంవత్సరానికి మొత్తం 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారు.

ఫలితాలు విడుదల చేసిన అనంతరం భట్టి విక్రమార్క మాట్లాడుతూ..ఇంటర్ ఫలితాలకోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక నమస్కాలు తెలియజేశారు. ఇంటర్ మొదటి , రెండవ సంవత్సరానికి మొత్తం విద్యార్థులు 9,97,012 మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. ఇంటర్ ఫస్టియర్‌లో 66.89 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 71.37 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. ఇంటర్ ఫలితాల్లో గత ఏడాది కంటే పాస్ పర్సంటేజ్ పెరిగిందన్నారు. ఇంటర్ ఫలితాల్లో అమ్మాయిలదే పై చేయి అని అన్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో బాలికలు 73 శాతం ఉత్తీర్ణత శాతం సాధించగా.. ఇంటర్ సెకండియర్‌లో 77.73 శాతం బాలికలు పాస్ అయ్యారని భట్టి విక్రమార్క వెల్లడించారు.

కాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఇయర్‌, సెకండ్ ఇయర్‌ పబ్లిక్‌ పరీక్షలు మార్చి 5 నుంచి 25వ తేదీ వరకు జరిగిన సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా 1532 పరీక్ష కేంద్రాల్లో మొత్తం 9.50 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 4.88 లక్షల మంది ఫస్టియర్ విద్యార్థులు.. 5 లక్షలకుపైగా సెకండియర్ విద్యార్థులు ఉన్నారు. పరీక్షల అనంతరం మొత్తం 19 సెంటర్లల్లో మార్చి 19 నుంచి ప్రారంభమైన ఈ మూల్యాంకనం ప్రక్రియ ఏప్రిల్‌ 10వ తేదీతో ముగిసింది. ప్రతి సెంటర్‌లో దాదాపు 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది మూల్యాంకన విధుల్లో పాల్గొని సకాలంలో మూల్యాంకనం ప్రక్రియ పూర్తి చేశారు.

ఫలితాల వెల్లడి అనంతరం విద్యార్ధులు తమ హాల్‌ టికెట్ నెంబర్ , పుట్టిన తేదీ వివరాలు ఎంటర్‌ చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చు. ఫలితాల వెల్లడి తర్వాత రీకౌంటింగ్, రీవాల్యుయేషన్‌కు సైతం అవకాశం ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించిన తేదీలను అధికారులు మంగళవారం ఫలితాలు విడుదల అనంతరం వెల్లడిస్తారు. అనంతరం ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్ధులకు నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించేందుకు ఇంటర్ బోర్డు ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ ఫలితాలు వెల్లడించిన సంగతి తెలిసిందే.

Leave a Reply