Telangana | పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం

Telangana | పద్మశ్రీ అవార్డులను ప్రకటించిన కేంద్రం
- 45మంది మట్టిలో మాణిక్యాలకు పద్మశ్రీ అవార్డు
Telangana | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : కేంద్ర ప్రభుత్వం 45మందికి పద్మశ్రీ పురస్కారాలను ప్రకటించింది. తెలంగాణకు చెందిన మామిడి రామరెడ్డికి పద్మశ్రీ అవార్డు వరించింది. పాడి, పశుసంవర్ధక విభాగాల్లో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఈ పురస్కారం ప్రకటించింది. అలాగే తమిళనాడుకు చెందిన నటేశన్, హైదరాబాద్ లోని సీసీఎంబీలో పని చేస్తున్న డాక్టర్ కుమారస్వామి తంగరాజ్కు జన్యుసంబంధ పరిశోధనలకు గాను పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది.
ఎంపికైన వారు వీరే..
అంకె గౌడ (కర్ణాటక)
అర్మిడ ఫెర్నాండెజ్ (మహారాష్ట్ర)
భగవాన్దాస్ రాయికర్ (మధ్యప్రదేశ్)
భిక్ల్యా లదక్య దిండా (మహారాష్ట్ర)
బ్రిజ్లాల్ భట్ (జమ్ముకశ్మీర్)
బుద్రి తాటి (ఛత్తీస్గడ్)
చరణ్ హెంబ్రామ్ (ఒడిశా)
చిరంజి లాల్యాదవ్ (ఉత్తర్ ప్రదేశ్)
ధార్మిక్లాల్ చునిలాల్ పాండ్య (గుజరాత్)
గఫ్రుద్దీన్ మెవాటి జోగి (రాజస్థాన్)
హాలీ వార్ (మేఘాలయ)
ఇంద్రజిత్ సింగ్ సిద్దు (చండీగఢ్)
కె. పజనీవెల్ (పుదుచ్చెరి)
కైలాశ్ చంద్ర పంత్ (మధ్యప్రదేశ్)
ఖేమ్ రాజ్ సుంద్రియాల్ (హరియానా)
కొల్లాక్కయిల్ దేవకి అమ్మ జీ (కేరళ)
కుమారస్వామి తంగరాజ్ (తెలంగాణ)
మహేంద్ర కుమార్ మిశ్రా (ఒడిశా)
మిర్ హజీభాయ్ కసమ్భాయ్ (గుజరాత్)
మోహన్ నాగర్ (మధ్యప్రదేశ్)
నరేష్ చంద్ర దేవ్ వర్మ (త్రిపుర)
నీలేష్ వినోద్చంద్ర మండేవాలా (గుజరాత్)
నూరుద్దీన్ అహ్మద్ (అస్సాం)
ఒతువర్ తిరుత్తణి స్వామి నాథన్ (తమిళనాడు)
పద్మ గుర్మీత్ (లద్ధాఖ్)
పోకిలా లెక్తెపి (అస్సాం)
పుణ్యమూర్తి నటేషణ్ (తమిళనాడు)
ఆర్.కృష్ణన్ (తమిళనాడు)
రఘుపత్ సింగ్ (ఉత్తర్ప్రదేశ్)
రఘువీర్ తుకారామ్ ఖేడ్కర్ (మహారాష్ట్ర)
రాజస్తపతి కలియప్ప గౌండర్ (తమిళనాడు)
రామా రెడ్డి మామిడి (తెలంగాణ)
రామచంద్ర గోడ్బోలే – సునీత గోడ్బోలే (చత్తీస్గఢ్)
ఎస్జీ సుశీలమ్మ (కర్ణాటక)
సంగ్యుసంగ్ ఎస్ పొంగెనెర్ (నాగాలాండ్)
షఫీ షౌక్ (జమ్ము కశ్మీర్)
శ్రీరంగ్ దేవబా లాడ్ (మహారాష్ట్ర)
శ్యామ్ సుందర్ (ఉత్తర్ప్రదేశ్)
సింహాచల్ పాత్రో (ఒడిశా)
సురేశ్ హనగవాడి (కర్ణాటక)
టాగరామ్ భీల్ (రాజస్థాన్)
తేచి గుబిన్ (అరుణాచల్ ప్రదేశ్)
తిరువర్రూర్ భక్తవత్సలం (తమిళనాడు)
విశ్వ బంధు (బిహార్)
ముమ్నామ్ జాత్ర సింగ్ (మణిపుర్)
హైదరాబాద్కు చెందిన డాక్టర్ కుమారస్వామి తంగరాజ్, తెలంగాణకు చెందిన రామారెడ్డి మామిడి పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. కుమారస్వామి తంగరాజ్ సీసీఎంబీ శాస్త్రవేత్త. మానవ పరిణామ క్రమం, జన్యుసంబంధ వ్యాధులపై ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు.
