Swiss Open | సెమీస్‌లో గాయత్రి-ట్రిసా జోడీ..

స్విస్‌ ఓపెన్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ మహిళల డబుల్స్‌ జోడీ గాయత్రి గోపీచంద్‌-ట్రిసా జాలీ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. ఈరోజు (శుక్రవారం) జరిగిన మహిళల డబుల్స్‌ క్వార్టర్‌ ఫైనల్లో 4వ సీడ్‌ గాయత్రి-ట్రిసా జోడీ 21-18, 21-14 తేడాతో 8వ సీడ్‌ టింగ్‌ యెవుంగ్‌-పుయ్‌ లామ్‌ యెవుంగ్‌ (హాంకాంగ్‌) జంటను వరుస గేముల్లో చిత్తు చేసి టైటిల్‌ వేటలో మరో అడుగు ముందు వేశారు.

ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ప్రి-క్వార్టర్స్‌లో ముత్తుసామి 18-21, 21-15, 21-5 తేడాతో డెన్మార్క్‌ టాప్‌ షట్లర్‌, ప్రపంచ రెండో ర్యాంకర్‌ ఆండర్స్‌ అంటోన్సెన్‌పై సంచలన విజయం సాధించి క్వార్టర్‌ ఫైనల్స్‌లోకి ప్రవేశించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *